హైస్కూల్‌లో అడ్మిషన్ల జోరు

ABN , First Publish Date - 2022-07-07T05:20:54+05:30 IST

సంబేపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రవేశాల కోసం విద్యార్థులు పోటెత్తారు. ఈ సంవత్సరం నుంచి అత్యున్నత విద్యా విధానానికి కేంద్ర బిందువైన సీబీఎ్‌సఈ సిలబ్‌సను ఈ పాఠశాలలో ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

హైస్కూల్‌లో అడ్మిషన్ల జోరు
అడ్మిషన్లకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

సంబేపల్లె, జూలై 6: సంబేపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రవేశాల కోసం విద్యార్థులు పోటెత్తారు. ఈ సంవత్సరం నుంచి అత్యున్నత విద్యా విధానానికి కేంద్ర బిందువైన సీబీఎ్‌సఈ సిలబ్‌సను ఈ పాఠశాలలో ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థి రెడ్డి నిఖితారెడ్డి 584 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించగా, మరో విద్యార్థిని ఫర్హానా 550 మార్కులు సాధించి మండల స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. మండలానికి సమీపంలోని రాయచోటి పట్టణం నుంచి ఈ పాఠశాలకు ప్రవేశాల కోసం ప్రారంభమైన రెండు రోజులకే 100కు పైగా అడ్మిషన్లు జరిగినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-07-07T05:20:54+05:30 IST