అమెరికా స్కూల్లో సరికొత్త ప్రయోగం.. విద్యార్థులకు పని, పారితోషికం..! విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-11T01:31:13+05:30 IST

అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రంలోని ఓ పాఠాశాల వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులతోనే అక్కడి పరిసరాలను శుభ్రం చేయిస్తూ గంటకు పదిహేను డాలర్ల చొప్పున చెల్లిస్తోంది.

అమెరికా స్కూల్లో సరికొత్త ప్రయోగం.. విద్యార్థులకు పని, పారితోషికం..! విషయం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రంలోని  ఓ పాఠాశాల వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులతోనే అక్కడి పరిసరాలను శుభ్రం చేయిస్తూ గంటకు పదిహేను డాలర్ల చొప్పున చెల్లిస్తోంది. అక్కడ సిబ్బంది కొరత వేధిస్తుండటంతో పాఠశాల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. చెప్పింది చెప్పినట్టు చేస్తూ విద్యార్థులు కూడా ప్రశంసలు పొందుతున్నారు. ఇక స్కూల్ యాజమాన్యం కూడా.. ‘మన విద్యార్థులే కదా..’ అంటూ పారితోషికం విషయంలో కొతలు విధించలేదు. ఇతరులను పనిలో పెట్టుకుంటే ఎంత చెల్లించాల్సి వస్తుందో అంత మొతాన్నీ విద్యార్థులకు ఇస్తోంది. కొత్త వారిని పనిలోకి చేర్చుకునే వరకూ తాత్కాలిక ప్రాతిపదికన పాఠశాల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే..  హైస్కూల్ స్థాయి విద్యార్థులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి ఉంది. 

Updated Date - 2022-01-11T01:31:13+05:30 IST