మెలకువలతో అధిక దిగుబడి

ABN , First Publish Date - 2022-01-23T04:56:42+05:30 IST

తగిన మెలుకువలు పాటిస్తే మామిడిలో అధికదిగుబడి సాధించవచ్చని అనంతరాజుపేట ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త శ్రీధర్‌ పేర్కొన్నారు.

మెలకువలతో అధిక దిగుబడి
మామిడి పంట రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారి

చిట్వేలి, జనవరి22: తగిన మెలుకువలు పాటిస్తే మామిడిలో అధికదిగుబడి సాధించవచ్చని అనంతరాజుపేట ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త శ్రీధర్‌ పేర్కొన్నారు. శనివారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రాజుకుంట రైతు భరోసా కేంద్రంలో మామిడి పంటపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షపాతం ఎక్కువవడంతో మామిడి పూతరావ డం ఆలస్యమైందన్నారు. మెలుకువలు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని రైతులకు వివరించారు. హెచ్‌ఓ ఆషియా, ఉద్యాన, వ్యవసాయ శాఖ సహాయకు లు, వలంటీర్లు, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T04:56:42+05:30 IST