MMTS : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2021-11-27T14:48:03+05:30 IST

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌ ప్రాంతాలను కలిపే...

MMTS : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌ ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రారంభంపై వివరణ సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. 2017 నాటికే ప్రారంభం కావాల్సిన ఎంఎంటీఎస్‌ రెండోదశ ఇప్పటికీ ప్రారంభం కాలేదని పేర్కొం టూ ఎం.శ్రీనివా్‌సరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి  వాదనలు నమోదు చేసుకుంది. ఈ వ్యవహారంపై వివరణ సమర్పించాలని నోటీసులు జారీచేసింది. విచారణ ఆరువారాలపాటు వాయిదా పడింది.

Updated Date - 2021-11-27T14:48:03+05:30 IST