ఎస్‌సీ వర్గీకరణ చేయాలంటూ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-06-26T06:25:21+05:30 IST

ఎస్‌సీ వర్గీకరణ చేయాలంటూ ఎంఆర్‌పీఎస్‌ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌ బచ్చలి రజనీకాంత్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను శుక్రవారం మహాజన్‌ సోషలిస్టు పార్టీ జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్‌ జెండా ఊపి ప్రారంభించారు.

ఎస్‌సీ వర్గీకరణ చేయాలంటూ పాదయాత్ర
పాదయాత్ర ప్రారంభిస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు

కళ్యాణ్‌నగర్‌, జూన్‌ 25: ఎస్‌సీ వర్గీకరణ చేయాలంటూ ఎంఆర్‌పీఎస్‌ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌ బచ్చలి రజనీకాంత్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను శుక్రవారం మహాజన్‌ సోషలిస్టు పార్టీ జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపిచినప్పటికీ బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదని, ఎస్‌సీ వర్గీకరణను వెంటనే చేయాలని, లేకపోతే జూలై 2న హైదరాబాద్‌లో జరిగే బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ పాదయాత్ర మున్సిపల్‌ టీ జంక్షన్‌ నుంచి హైదరాబాద్‌ వరకు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు మంద రవికుమార్‌, పల్లె బాబు, రాజయ్య, మాతంగి కుమార్‌, కాంపెల్లి స్వామి, రాంబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:25:21+05:30 IST