హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం

ABN , First Publish Date - 2022-04-04T22:43:06+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. మరో ముప్పై మందికి పైగా గాయపడ్డారు.

హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం

హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. మరో ముప్పై మందికి పైగా గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ బస్సు సోమవారం మనాలి నుంచి షిమ్లా వెళ్తుండగా, చండీఘడ్-మనాలి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి పర్వతం పక్కనున్న గోడను ఢీకొంది. బస్సు ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తునట్లు మండి ఎస్పీ షాలిని అగ్నిహోత్రి చెప్పారు. 

Updated Date - 2022-04-04T22:43:06+05:30 IST