పాక్‌లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ

ABN , First Publish Date - 2021-05-09T11:18:15+05:30 IST

పాకిస్థాన్‌ చరిత్ర లో తొలిసారి ఒక హిందూ మహిళ కేంద్ర సుపీరియర్‌ సేవలు(సీఎస్ఎస్‌) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. సింధ్‌ ప్రావిన్స్‌లో శికర్‌పూర్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన సనా రామ్‌చంద్‌ ఈ ఘ

పాక్‌లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ

తొలిసారిగా సీఎస్ఎస్‌లో ఉత్తీర్ణత

ఇస్లామాబాద్‌:  పాకిస్థాన్‌ చరిత్ర లో తొలిసారి ఒక హిందూ మహిళ కేంద్ర సుపీరియర్‌ సేవలు(సీఎస్ఎస్‌) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. సింధ్‌ ప్రావిన్స్‌లో శికర్‌పూర్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన సనా రామ్‌చంద్‌ ఈ ఘనత సాధించారు. పాక్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీఎస్‌ఎస్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు పాకిస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్(పాస్)లో విధులు నిర్వర్తిస్తారు. ఇప్పటికే ఎంబీబీఎస్‌ చేసిన సనా వైద్యవృత్తిలో ఉన్నారు. సీఎస్ఎస్‌ రాత పరీక్షకు 18,553 మంది హాజరు కాగా.. ఉత్తీర్ణులైన 221 మందిలో సనా ఒకరు. 


Updated Date - 2021-05-09T11:18:15+05:30 IST