హిందుత్వంతోనే దేశ రక్షణ

ABN , First Publish Date - 2022-08-08T05:38:17+05:30 IST

హిందుత్వంతోనే దేశరక్షణ ముడిపడి ఉందని గోషామహల్‌

హిందుత్వంతోనే దేశ రక్షణ
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

  • గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

శంకర్‌పల్లి, ఆగస్టు 7 : హిందుత్వంతోనే దేశరక్షణ ముడిపడి ఉందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి  శంకర్‌పల్లి మండలం పొద్దటూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ. ప్రతి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసి హిందుత్వాన్ని కాపాడాలని యువకులకు సూచించారు. దేశరక్షణ కోసం ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. పొద్దటూర్‌ గ్రామంలో భారీ విగ్రహన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఏనుగు నరసింహారెడ్డి, ఎంపీటీసీ ప్రవళిక, సీనియర్‌ నాయకులు వెంకట్‌రెడ్డి, రాములుగౌడ్‌, గంగాధర్‌ సింగ్‌, యువకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. 



Updated Date - 2022-08-08T05:38:17+05:30 IST