అధికారుల అలసత్వం..
ABN , First Publish Date - 2020-09-29T12:24:42+05:30 IST
మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా తాగునీరు.. వృథా అవుతోంది.
తాగునీరు.. డ్రైనేజీ పాలు
హిందూపురం: మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా తాగునీరు.. వృథా అవుతోంది. పట్టణంలో రెండ్రోజుల క్రితం శ్రీరా మిరెడ్డి తాగునీటి పథకం పైప్లైన్ పగిలింది. మరమ్మతులు చేపట్టడంలో ము నిసిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మునిసిపల్ కార్యాలయానికి కూత వేటు దూరంలో మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారి పక్కన ఎయిర్ ఔట్ కోసం ఏర్పాటు చేసిన తొట్టి నుంచి నీరు వృఽథాగా పోతోంది. డ్రైనేజీ పాలవుతోంది. అయినా అధికారులు గుర్తించకపోవటంతో అటుగా వెళ్తున్న వారు తాగునీటిని వృఽ థా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.