The Debate: ఎంపీ మాధవ్ ను ప్రభుత్వం రక్షిస్తోందా?
ABN , First Publish Date - 2022-08-14T02:04:35+05:30 IST
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Hindupuram Mp Gorantla Madhav) సంచలనం సృష్టించింది. టీడీపీ (Tdp), వైసీపీ (Ycp) మధ్య మాటల...
అమరావతి/హైదరాబాద్: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Hindupuram Mp Gorantla Madhav) సంచలనం సృష్టించింది. టీడీపీ (Tdp), వైసీపీ (Ycp) మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. టీడీపీ నేతలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. వైసీపీ మాత్రం బాధితులు కంప్లైంట్ చేయాలని చెబుతోంది. అయితే తాజాగా వీడియో నిజమని అమెరికా ఫోరెన్సిక్ (America Forensic) ధృవీకరించిందని టీడీపీ నేత పట్టాభి (Pattabhi) తెలిపారు. మార్ఫింగ్, ఎడిటింగ్ లాంటివి ఏమీ జరగలేదని నివేదికలో ఉన్నట్లు చెప్పారు. ‘‘వాట్ మిస్టర్ జగన్రెడ్డి (Jagan reddy).. ఇది సరిపోతుందా మీకు. మీ ఎంపీపై చర్య తీసుకోవడానికి ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా’’ అని ప్రశ్నించారు
ఈ నేపథ్యంలో ‘‘వీడియో అసలైనది కాదంటూ బూతు ఎంపీని రక్షిస్తున్న ప్రభుత్వం?. అసలు అది పరీక్షలకే పనికిరాదని తేల్చిన అధికార పక్షం?. అక్కడా ఇక్కడా కాదు అమెరికా నుంచి రిపోర్ట్ తెచ్చిన టీడీపీ?. ఆ వీడియో అసలైనదే అంటున్న ప్రతిపక్షం?. అన్ని వర్గాల ప్రజలు అడుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడా?.’’ అనే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.