Hiraben Modi: పిల్లలకు మువ్వన్నెల జెండాలు పంచిన మోదీ తల్లి

ABN , First Publish Date - 2022-08-13T23:21:26+05:30 IST

దేశ 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని మూడో రోజుల ''హర్ ఘర్ తిరంగా'' ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి..

Hiraben Modi: పిల్లలకు మువ్వన్నెల జెండాలు పంచిన మోదీ తల్లి

గాంధీనగర్: దేశ 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని మూడో రోజుల ''హర్ ఘర్ తిరంగా'' ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (Hiraben Modi) శనివారంనాడు ఉత్సాహంగా పాల్గొన్నారు. గాంధీనగర్ సిటీ శివార్లలోని తన నివాసంలో త్రివర్ణ పతాకాలను (Tri colour flags) పిల్లలకు పంచుతూ, వారితో కలిసి జెండా ఎగురవేశారు. గత జూన్‌లో హీరాబెన్ నూరవ వసంతంలోకి అడుగుపెట్టారు. మోదీ చిన్న సోదరుడు పంకజ్ మోదీ ఇంట్లో హీరాబెన్ ఉంటున్నారు.


కాగా, మూడు రోజుల ''హర్ ఘర్ తిరంగా'' ప్రచారానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లోని చిల్ట్రన్స్ యూనివర్శిటీలో జెండా ఎగురవేసి శనివారం శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తిరంగా జెండా ర్యాలీల్లో పాల్గొంటూ ప్రజల్లో ఉత్సాహం నింపుతున్నారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ మెహసానా జిల్లాలోని విజపూర్‌లో చేపట్టిన ఏడు కిలోమీటర్ల ర్యాలీలో పాల్గొన్నారు. వడోదరాలో బీజేపీ ఎంపీ రంజన్ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ''తిరంగా యాత్ర''లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లోనూ ఇదే తరహా యాత్రలు జరిగాయి.

Updated Date - 2022-08-13T23:21:26+05:30 IST