డివైడర్‌ను ఢీ కొని ఎగిరిపడి..

ABN , First Publish Date - 2021-03-01T09:36:34+05:30 IST

అతి వేగం.. మలుపు వద్ద నిర్లక్ష్యం.. ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్నాయి. సరదాగా చేపల వేటకు బయల్దేరిన వారు విగతజీవులుగా మారారు

డివైడర్‌ను ఢీ కొని ఎగిరిపడి..

షాద్‌నగర్‌లో లారీ కిందకు దూసుకెళ్లిన కారు; ముగ్గురి మృతి 

షాద్‌నగర్‌ రూరల్‌: అతి వేగం.. మలుపు వద్ద నిర్లక్ష్యం.. ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్నాయి. సరదాగా చేపల వేటకు బయల్దేరిన వారు విగతజీవులుగా మారారు. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ బైపాస్‌ రోడ్డుపై ఆదివారం జరిగింది. హైదరాబాద్‌ బోరబండ, మలక్‌పేటకు చెందిన సయ్యద్‌ ఒబేద్‌ (21), జిషాన్‌ (22), అన్నాన్‌ (22) హరీష్‌ (22) జడ్చర్ల వైపు వస్తున్నారు. షాద్‌నగర్‌ శివారులోని ఓ పరిశ్రమ సమీపంలో మలుపు వద్ద వారి కారు డివైడర్‌ను బలంగా ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు ఎగిరి అవతలి రోడ్డుపై పడి హైదరాబాద్‌ వెళ్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఆ ధాటికి కారు నుజ్జునుజ్జవగా ఒబేద్‌, జిషాన్‌ అక్కడికక్కడే మృతిచెందారు. అన్నాన్‌ ఆస్పత్రికి  తరలిస్తుండగా చనిపోయాడు. తీవ్ర గాయాలైన హరీ్‌షను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-03-01T09:36:34+05:30 IST