వ్యక్తిని ఢీకొని.. ఆపై లారీని ఢీకొట్టి..!

ABN , First Publish Date - 2022-07-01T08:48:05+05:30 IST

వ్యక్తిని ఢీకొని.. ఆపై లారీని ఢీకొట్టి..!

వ్యక్తిని ఢీకొని.. ఆపై లారీని ఢీకొట్టి..!

అదుపు తప్పి ట్రావెల్స్‌ బస్సు బోల్తా

బేస్తవారపేట, జూన్‌ 30 : నడిచివెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. ఆపై లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో అదుపు తప్పి బోల్తా పడడంతో 30మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని బేస్తవారపేట మండలం ఒందుట్ల-పూసలపాడు మధ్య అమరావతి- అనంతపురం రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బుధవారం రాత్రి విజయవాడ నుంచి అనంతపురానికి బయలుదేరిన ఎస్‌వీకేడీటీ ట్రావెల్స్‌ బస్సులో 32మంది ప్రయాణికులున్నారు. గురువారం తెల్లవారుజాముకు బస్సు పూసలపాడు సమీపానికి వచ్చింది. రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ జంగా సాంబశివుడు(78) నడుచుకుంటూ వెళుతుండగా, బస్సుడ్రైవర్‌ ఆయనను వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ఎగిరిపడి ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సు అదుపుతప్పి దాణా లోడుతో వస్తున్న లారీని ఎదురుగా ఢీకొట్టి, నడిరోడ్డుపై బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో 10మంది తీవ్రంగా గాయపడగా, 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి.  లారీ డ్రైవర్‌ రెండు కాళ్లూ విరిగిపోయాయి. 

Updated Date - 2022-07-01T08:48:05+05:30 IST