హిజాబ్పై కోర్టు ధిక్కారం వద్దు
ABN , First Publish Date - 2022-05-28T18:00:33+05:30 IST
హిజాబ్ విషయంలో కోర్టు తీర్పును పాటించాలని, దేశ రాజ్యాంగానికి గౌరవం ఇవ్వాలని మాజీ మంత్రి ఈశ్వరప్ప తెలిపారు. శివమొగ్గలో శుక్రవారం ఆయన మీడియాతో
- మాజీ మంత్రి ఈశ్వరప్ప
బెంగళూరు: హిజాబ్ విషయంలో కోర్టు తీర్పును పాటించాలని, దేశ రాజ్యాంగానికి గౌరవం ఇవ్వాలని మాజీ మంత్రి ఈశ్వరప్ప తెలిపారు. శివమొగ్గలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ముస్లిం విద్యార్థులు ఉండాలంటే న్యాయస్థానం తీర్పును గౌరవించాల్సిందేనన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఇటీవల అన్ని విద్యాసంస్థలలోనూ సజావుగా సాగుతున్నాయన్నారు. అయితే మంగళూరులో మరోసారి హిజాబ్ వివాదం తెరపైకి వచ్చిందన్నారు. హంపనకట్టిలోని విశ్వవిద్యాలయంకు అను బంధమైన కళాశాలలో హిజాబ్తో తరగతులకు వచ్చేందుకు ప్రయత్నించారన్నారు. 40మంది కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హిజాబ్తోనే తరగతులకు రావడం, మాకూ కాషాయం శాలువాలతో వచ్చే అవకాశం ఉండాలని విద్యార్థులు ఆందోళన చేశారన్నారు. ఇటువంటి గందరగోళ వాతావరణం సరికాదన్నారు. హిజాబ్కు సంబంధించి ముస్లింనేతలు తమ భావనలను మార్చు కోవాలన్నారు. యువతకు ముస్లింనేతలు మార్గదర్శకులు కావాలని, కానీ దారి తప్పించరాదన్నారు.