‘నియంతలా వ్యవహరిస్తున్న హెచ్ఎం మాకొదు’్ద
ABN , First Publish Date - 2022-08-13T05:21:03+05:30 IST
పాఠశాలలో నియంతగా వ్యవహరిస్తున్న ఈ ప్రధానో పాధ్యాయుడు మాకొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈవో మనోహర్కు ఫిర్యా దు చేశారు.
పెద్దమండ్యం, ఆగస్టు 12: పాఠశాలలో నియంతగా వ్యవహరిస్తున్న ఈ ప్రధానో పాధ్యాయుడు మాకొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈవో మనోహర్కు ఫిర్యా దు చేశారు. మండలంలోని బండ మీదపల్లి గ్రామపంచాయతీ తురకపల్లి ప్రాథమికో న్నత పాఠశాలలో హెచ్ఎంపై శుక్రవారం ఎంఈవో మనోహర్ విచారణ చేపట్టారు. పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు పట్టికలో ఉపాధ్యాయురాలి పేరు ఉన్న చోట హెచ్ఎం సంతకం చేశారని, ఈ ఘటనపై ప్రశ్నించినం దుకు రెండు చెంపలపై కొట్టినట్లు ఉపాధ్యాయురాలు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ సం ఘటన అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు క్రమశిక్షణ పేరు పాఠశాలలో గోడలను నాకిస్తారని హెచ్ఎంపై గ్రామస్తులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎంఈవో తురకపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎంపై విచారించారు. పాఠశాల వైస్ చైర్మన్ షామీర్, విద్యార్థులు, విద్యా ర్థుల తల్లిదండ్రులను విచారించారు. అనంతరం డీఈవో రాఘవరెడ్డి ఫోన్ ద్వారా పాఠ శాల విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడా రు. హెచ్ఎం సెల్ఫోన్ స్వీచ్ఆఫ్ చేసి పాఠశాలకు హాజరుకాలేదని ఎంఈవో తెలిపారు. విచారణ అనంతరం హెచ్ఎంపై చర్యలు చేపట్టనున్నట్లు డీఈవో తెలిపినట్లు ఎంఈవో తెలి పారు. ఈ హెచ్ఎం ను పాఠశాలకు రానివ్వకుండ చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి దండ్రులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.