వడ్డెపల్లి రోడ్డులో ఎన్డీపీ లిక్కర్ పట్టివేత
ABN , First Publish Date - 2022-10-04T06:25:12+05:30 IST
వడ్డెపల్లి రోడ్డులో ఎన్డీపీ లిక్కర్ పట్టివేత
హనుమకొండ క్రైం, అక్టోబరు 3: ఇతర రాష్ట్రం నుంచి తెచ్చిన సుంకం చెల్లించని మద్యం(ఎన్డీపీ) సోమవారం వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు వడ్డెపల్లి రోడ్డులో పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగ ర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన ఐతిరాజుల రమేష్ హరియాన రాష్ట్రం నుంచి తక్కువ ధరకు ఎన్డీపీ మద్యం మూడు రోజుల క్రితం కొనుగోలు చేసి హను మకొండకు కారులో వస్తున్నాడు. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో రమేష్ ను వడ్డెపల్లి రోడ్డులోని తిరుమల బార్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తూ కారును ఆపారు. కారును సోదా చేయగా కారులో పెద్ద మొత్తంలో మద్యం లభించింది. విచా రించగా చేసిన తప్పును ఒప్పుకుని దసరా పండగకు మద్యం విక్రయించేందుకు పట్టు కొస్తున్నట్టు ఒప్పుకున్నాడు. రూ.83వేల మద్యంతో పాటు ఒక కారును స్వాధీనం చేసు కున్నారు. మద్యం పట్టుకున్న వారిలో టాస్క్ఫోర్స్ ఇన్స్స్పెక్టర్లు నరేష్కుమార్, వెంకటే శ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.