జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటండి

ABN , First Publish Date - 2022-08-08T04:53:43+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా జాతీయ ఔన్నత్యాన్ని చాటడానికి ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భీమునిపల్లె లక్ష్మీదేవి, కమిషనర్‌ వెంకటరమణయ్య పిలుపునిచ్చారు.

జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటండి
హర్‌ ఘర్‌ కా తిరంగా ర్యాలీ చేపట్టిన మున్పిపల్‌ చైర్‌పర్సన్‌ కమీషనర్‌ కౌన్సిలర్లర్లు సిబ్బంది

ప్రొద్దుటూరు అర్బన్‌ ,ఆగస్టు 7 : ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా జాతీయ ఔన్నత్యాన్ని చాటడానికి ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భీమునిపల్లె లక్ష్మీదేవి, కమిషనర్‌ వెంకటరమణయ్య పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి హర్‌ ఘర్‌కా తిరంగా పేర ఇంటింటిపై జాతీయ జెండా పెట్టండి దేశభక్తిని చాటండని పిలుపుతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ మున్పిపల్‌ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు సాగింది. అనంతరం గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి దేశభక్తి నినాదాలు ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగస్వామి, ఏఈ ఉమా మహేశ్వరి, కౌన్సిలర్లు నాగేంద్ర, గరిశపాటి లక్ష్మీదేవి, వంశీధర్‌రెడ్డి, మెప్మా,సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-08T04:53:43+05:30 IST