హోలీ వేడుకలలో విషాదం

ABN , First Publish Date - 2022-03-19T00:44:38+05:30 IST

హోలీ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి ఆనందంగా వేడుకలు చేసుకున్న బాలుడు కాలువలో స్నానానికి

హోలీ వేడుకలలో విషాదం

ఏలూరు: హోలీ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి ఆనందంగా వేడుకలు చేసుకున్న బాలుడు కాలువలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు బీసీ కాలనీకి చెందిన సిరికి ఈశ్వర్‌ ఆకాష్‌(16) ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం హోలీ సందర్భంగా తాను ఉండే కాలనీలో స్నేహితులతో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి చిలకంపాడు లాకుల నుంచి పరిమెళ్ళ వెళ్లే దారిలో వున్న చినకాపవరం కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. 

Updated Date - 2022-03-19T00:44:38+05:30 IST