రాజారావు సేవలు మరువలేం : సుజాత

ABN , First Publish Date - 2021-03-08T06:07:47+05:30 IST

చింతలపూడి నియోజక వర్గ టీడీపీ కన్వీనర్‌ డాక్టర్‌ కర్రా రాజారావు పార్టీకి అందించిన సేవలు మరపురానివని మాజీ మంత్రి పీతల సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాం జనేయులు అన్నారు.

రాజారావు సేవలు  మరువలేం : సుజాత
రాజారావు పార్థివ దేహం వద్ద మాజీ మంత్రి పీతల సుజాత నివాళులు

చింతలపూడి/కామవరపుకోట, మార్చి 7 : చింతలపూడి నియోజక వర్గ టీడీపీ కన్వీనర్‌ డాక్టర్‌ కర్రా రాజారావు పార్టీకి అందించిన సేవలు మరపురానివని మాజీ మంత్రి పీతల సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాం జనేయులు అన్నారు. ఆదివారం తెల్లవారుజా మున  రాజారావు పార్థివ దేహాన్ని హైదరాబాద్‌ నుంచి చింతలపూడి ఆంటోని నగర్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, తదిత రులు నివాళులర్పించారు.  మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళీ రామకృష్ణ, మద్దాల రాజేష్‌కుమార్‌, ఏఎంసీ మాజీ  ఛైర్మన్లు జె ముత్తారెడ్డి, వెంకట సుబ్బారావు, పలువురు టీడీపీ నాయకులు ఆయనకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మధ్యాహ్నం ఆయన భౌతిక కాయాన్ని కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని ఆయన స్వగ్రామం జి. కొత్తపల్లికి తరలించారు. 


Updated Date - 2021-03-08T06:07:47+05:30 IST