కేసీఆర్ కోలుకోవాలని మృత్యుంజయ హోమం
ABN , First Publish Date - 2021-04-23T04:52:45+05:30 IST
సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తు గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రంలో రాష్ట్ర ఫారెస్టు డెవల్పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతా్పరెడ్డి ఆధ్వర్యంలో మృత్యుంజయ మహా యజ్ఞం నిర్వహించారు.
వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ఆధ్వర్యంలో నిర్వహణ
వర్గల్, ఏప్రిల్ 22: సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తు గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రంలో రాష్ట్ర ఫారెస్టు డెవల్పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతా్పరెడ్డి ఆధ్వర్యంలో మృత్యుంజయ మహా యజ్ఞం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మసిద్ధాంతి, మర్పడగ మల్లికార్జున స్వామి క్షేత్ర వ్యవస్థాపకుడు చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో అనంతగిరిశర్మ, శశిధరశర్మ నేతృత్వంలో 40 మంది వేదపండితులతో నవగ్రహ నక్షత్ర శాంతి, ధన్వంతరి క్షేత్రంలో దాదాపు 4 గంటల పాటు హోమం నిర్వహించారు. ఎంపీపీ జాలిగామ లత, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగరాజు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.