కరోనా అంతం కోసం హోమం

ABN , First Publish Date - 2021-05-10T06:55:42+05:30 IST

మండలంలోని నాగవారిగూడెంలో కరోనా మహమ్మారి అంతం కావాలని కోరుతూ సర్పంచ్‌ సుర్వి యాదయ్య, గ్రామస్థుల ఆధ్వ ర్యంలో ఆదివారం గ్రామంలో హోమం నిర్వహించారు.

కరోనా అంతం కోసం హోమం
నాగవారిగూడెంలో హోమంలో పాల్గొన్న సర్పంచ్‌

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం నాగవారిగూడెంలో పూజలు

సంస్థాన్‌ నారాయణ పురం, మే 9: మండలంలోని నాగవారిగూడెంలో కరోనా మహమ్మారి అంతం కావాలని కోరుతూ సర్పంచ్‌ సుర్వి యాదయ్య, గ్రామస్థుల ఆధ్వ ర్యంలో ఆదివారం గ్రామంలో హోమం నిర్వహించారు. బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న కరోనా మహమ్మారికి అంతం కావాలని పూజలు చేశారు. ప్రతిఒక్కరూ స్వీయ నియం త్రణ పాటించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ముక్కర్ల స్వామి, గణేష్‌, జెనిగల మల్లయ్య, యాదిరెడ్డి, జక్క నర్సింహారెడ్డి, లింగస్వామి పాల్గొన్నారు.



అనాజిపురం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో నీటి సమస్య

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో ఘటన

మోత్కూరు, మే 9: మండలంలోని అనాజి పురం విద్యుత్‌ సబ్‌స్టేష న్‌లో బోరు వటి ్టపోయి నీటికి కట కట ఏర్పడింది. సబ్‌స్టేషన్‌లోని ఎర్త్‌లకు తరుచు గా నీరు పోయా ల్సి ఉంటుంది. బో రు వట్టిపోయినం దున ఎర్త్‌లకు నీరు పోయలేకపో తున్నామని,  సబ్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలను పెం చలేకపోతున్నామని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న తాధికారులు స్పందించి సబ్‌ స్టేషన్‌లో బోరు మరమ్మతు చేయించి సమస్యను పరిష్కరించాలని ఆపరేటర్లు కోరుతున్నారు. 


Updated Date - 2021-05-10T06:55:42+05:30 IST