ఇంటింటి తనిఖీ.. భారీగా వాహనాల సీజ్‌

ABN , First Publish Date - 2022-05-28T07:03:43+05:30 IST

ప్రజల రక్షణే పోలీసుశాఖ బాధ్యత అని ఏఎస్పీ కిరణ్‌ కారే అన్నారు.

ఇంటింటి తనిఖీ.. భారీగా వాహనాల సీజ్‌
ఓవైసీనగర్‌లో కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్న ఏఎస్పీ కిరణ్‌కారే

ప్రజల సంరక్షణే మా బాధ్యత : ఏఎస్పీ కిరణ్‌కారే

భైంసా, మే 27 : ప్రజల రక్షణే పోలీసుశాఖ బాధ్యత అని ఏఎస్పీ కిరణ్‌ కారే అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓవైసీనగర్‌ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాంలో భాగంగా కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. పోలీసు బలగాలు మూడుగంటల పాటు తనిఖీలు నిర్వహించారు. సంఘ విద్రోహులు నివాసం ఉండడం, సంచారం చేసే అవకాశాలు ఉంటాయని, వారి ఆట కట్టించే క్రమంలోనే తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు వివరించారు. కొత్త వ్యక్తులు, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలందరూ స్నేహాభావంతో, ప్రశాంత వాతా వరణంలో ఉండాలని పోలీసులకు ప్రజలందించే సహాకారంతో సంఘ వ్యతి రేక మూకలను మరింత సమర్థవంతంగా అణిచి వేయగలమని అన్నారు. సరైన పత్రాలు లేని 71 ద్విచక్రవాహనాలు, 8 ఆటోలు, 2 టాటా వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కార్డన్‌సెర్చ్‌లో సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐలు, సుమారు 90 మంది పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-05-28T07:03:43+05:30 IST