తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
ABN , First Publish Date - 2021-04-18T05:44:59+05:30 IST
వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆదేశించారు.
అధికారులను ఆదేశించిన హోంమంత్రి సుచరిత
గుంటూరు, ఏప్రిల్ 17: వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆదేశించారు. నీటి పారుదలశాఖ అధికారులతో శనివారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సమావేశమయ్యారు. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు, డ్రెయినేజి వ్యవస్థలపై అధికారులతో చర్చించారు. పంటలకు తగిన సమయానికల్లా నీటి పారుదల పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.