జవాన్ జస్వంత్ మరణం బాధాకరం: హోంమంత్రి

ABN , First Publish Date - 2021-07-10T16:25:59+05:30 IST

అతి చిన్న వయసులోనే వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణించటం బాధాకరమని హోంమంత్రి సుచరిత అన్నారు.

జవాన్ జస్వంత్ మరణం బాధాకరం: హోంమంత్రి

గుంటూరు: అతి చిన్న వయసులోనే వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణించటం బాధాకరమని హోంమంత్రి సుచరిత అన్నారు. శనివారం ఉదయం జశ్వంత్‌ రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత నివాళులర్పించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ  దేశ రక్షణ కోసం తన ప్రాణాలు కోల్పోయిన జస్వంత్ త్యాగం మరువ లేనిదన్నారు. దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చిన ఆ తల్లిదండ్రుల జన్మ చరితార్థమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జస్వంత్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ్ముళ్ల కోసం జస్వంత్ నిరంతరం ఆలోచించేవాడని...వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడాతామన్నారు. జస్వంత్ వంటి సైనికుల బలిదానాల వల్లే మనం క్షేమంగా ఉన్నామని హోంమంత్రి సుచరిత అన్నారు. హోంమంత్రి సుచరితతో పాటు డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి, కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ విశాల్ గున్ని.... వీర జవాన్ జస్వంత్ భౌతికకాయానికి నివాళులర్పించారు. 

Updated Date - 2021-07-10T16:25:59+05:30 IST