సీఎం పర్యటనలో దళిత హోం మంత్రికి అవమానం

ABN , First Publish Date - 2022-02-18T14:29:24+05:30 IST

సీఎం పర్యటనలో దళిత హోం మంత్రికి చోటు దక్కలేదు. మంగళగిరి నియోజకవర్గంలోని రెండు కార్యక్రమాలలో హోం మంత్రి సుచరిత పేరు గల్లంతైంది.

సీఎం పర్యటనలో దళిత హోం మంత్రికి అవమానం

గుంటూరు : సీఎం పర్యటన నేపథ్యంలో దళిత హోం మంత్రికి అవమానం జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలోని రెండు కార్యక్రమాలలో హోం మంత్రి సుచరిత పేరు గల్లంతైంది. దీంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా ప్రోటోకాల్ మంత్రిగా హోం మంత్రి సుచరిత ఉన్నారు. స్థానిక ఎంపీ గల్లా జయదేవ్ పేరు కూడా ఇస్కాన్ సంస్థ వేయలేదు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీరంగనాధ రాజుని సైతం నిర్వాహకులు మరిచారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఇన్‌చార్జ్ మంత్రి పరిశీలించారు. నేడు మంగళగిరి నియోజకవర్గంలో అక్షయ పాత్ర కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అలాగే గోశాలకు శంకుస్థాపన చేయనున్నారు.

Updated Date - 2022-02-18T14:29:24+05:30 IST