YCP కార్యకర్తల పిల్లలకే వలంటీర్ పోస్టులు... ఏపీ Home minister వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-06-28T17:11:45+05:30 IST
రాష్ట్రంలోని వలంటీర్ పోస్టులపై హోంమంత్రి తానేటి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి: రాష్ట్రంలోని వలంటీర్ పోస్టులపై హోంమంత్రి తానేటి వనిత (Taneti vanita) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిడదవోలులో జరుగుతున్న వైసీపీ (YCP) ప్లీనరీలో అసంతృప్తిగా ఉన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగించారు. వలంటీర్ పోస్టులను పార్టీ కార్యకర్తల పిల్లలకే ఇచ్చామని అన్నారు. కార్యకర్తలను పట్టించుకోలేదనడం అవాస్తవమని తెలిపారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లలోని పిల్లలకే వలంటీర్ పదవులు ఇవ్వడం వాస్తవం కాదా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్ల పదవులతో పాటు వలంటీర్ పోస్టులు కూడా కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చామని హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు.