AP Floods: ఆరు జిల్లాల్లో వరద ప్రభావం: హోంమంత్రి వనిత
ABN , First Publish Date - 2022-07-22T18:42:24+05:30 IST
రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో వరద ప్రభావం ఉందని హోంమంత్రి తానేటి వనిత(Taneti vanita) తెలిపారు.
రాజమండ్రి: రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో వరద ప్రభావం ఉందని హోంమంత్రి తానేటి వనిత(Taneti vanita) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... వరద బాధితుల్లో ఇప్పటి వరకు 95 వేల మందికి ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. వరదల్లో సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి రూ.41 కోట్లు విడుదల చేశారన్నారు. వరదల వల్ల కోనసీమ జిల్లాలో ఐదుగురు మృతి చెందారని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు(Chandrababu) వరద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం పడవలపై వెళ్ళారన్నారు. టీడీపీపై టీడీపీకి చెందిన నేతలు అచ్చెన్నాయుడు, దివ్యవాణి, కేశినేని నానిలే ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు చేశారు.