ఆహ్లాదానికి నిలయం తారకరామ ప్రకృతి వనం

ABN , First Publish Date - 2021-07-25T05:38:14+05:30 IST

ఆహ్లాదానికి నిలయం తారకరామ ప్రకృతి వనమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు.

ఆహ్లాదానికి నిలయం తారకరామ ప్రకృతి వనం
తారకరామ ప్రకృతి వనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

జగిత్యాల టౌన్‌ , జూలై 24: ఆహ్లాదానికి నిలయం తారకరామ ప్రకృతి వనమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని తార కరామనగర్‌లో జగిత్యాల బల్దియా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తారకరామ ప్రకృతి వనాన్ని శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌, బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణితో కలిసి ఎ మ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. యాదాద్రి తరహాలో చిట్లడవిలాగా టీ ఆర్‌నగర్‌లో తారకరామ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతో షకరమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి వెంకటే శ్వర్‌ రావు, ఇన్‌చార్జి కమిషనర్‌ లక్ష్మీనారాయణ, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, కౌన్సిల ర్లు దేవేందర్‌ నాయక్‌, చాంద్‌ పాషా ఉన్నారు.


Updated Date - 2021-07-25T05:38:14+05:30 IST