అమెరికా పర్యాటకురాలిపై పబ్లిక్ టాయిలెట్‌లో అత్యాచారం..!

ABN , First Publish Date - 2022-08-12T05:19:33+05:30 IST

ప్యారిస్‌లో పర్యటిస్తున్న ఓ అమెరికా యువతి అత్యాచారానికి గురైంది. ఆమె బూత్రూమ్‌లో వెళ్లిన సమయంలో నిందితుడు ఆమెను బలాత్కరించాడు.

అమెరికా పర్యాటకురాలిపై పబ్లిక్ టాయిలెట్‌లో అత్యాచారం..!

ఎన్నారై డెస్క్: ప్యారిస్‌లో(Paris) పర్యటిస్తున్న ఓ అమెరికా యువతి అత్యాచారానికి గురైంది. ఆమె బూత్రూమ్‌లో వెళ్లిన సమయంలో నిందితుడు ఆమెను బలాత్కరించాడు. వీధుల్లో నివసించే ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆగస్టు 7న ఈ దారుణం జరిగింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రి సుమారు ఒంటిగంటకు సియేన్ నదీ తీరానికి సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న ఆమె నోట్రే డేమ్ కాథెడ్రల్ సమీపంలోని ఓ పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లింది. వీధుల్లో నివసించే ఓ వ్యక్తి ఆ సమయంలో ఆమెను బలాత్కరించాడు.


బాధితురాలు ఎంతసేపైనా తిరిగిరాకపోవడంతో బాయ్‌ఫ్రెండ్‌కు అనుమానం వచ్చి వెళ్లి చూడగా జరిగిన దారుణం గురించి తెలిసింది. నిందితుడు ఉత్తర ఆఫ్రీకా నుంచి ఫ్రాన్స్‌కు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేశారు. బాధితురాలు తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరిగి అమెరికాకు వెళ్లిపోయినట్టు తెలిపారు. అయితే..ఫ్రాన్స్ పోలీసులతో ఆమె టచ్‌లోనే ఉన్నట్టు చెప్పారు. కాగా.. ఆ ప్రాంతంలో పోకిరీలు నిత్యం పర్యాటకులను ఇబ్బందులు పెడుతున్నట్టు సమాచారం. 

Updated Date - 2022-08-12T05:19:33+05:30 IST