దుబాయిలో భారతీయుడిపై ప్రశంసలజల్లు.. కారణం ఏంటంటే!

ABN , First Publish Date - 2021-04-12T17:50:00+05:30 IST

భారత్‌కు చెందిన ఓ యువకుడు తన నిజాయితీతో అందిరి మనసు గెలుచుకుని, ప్రశంసలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు చెందిన సాజిద్ ఆలం దుబాయిలోని సూపర్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా

దుబాయిలో భారతీయుడిపై ప్రశంసలజల్లు.. కారణం ఏంటంటే!

దుబాయి: భారత్‌కు చెందిన ఓ యువకుడు తన నిజాయితీతో అందిరి మనసు గెలుచుకుని, ప్రశంసలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు చెందిన సాజిద్ ఆలం దుబాయిలోని  సూపర్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. తాజాగా ఆ సూపర్ మార్కెట్‌ను సందర్శించిన ఓ చైన యువకుడు సూపర్ మార్కెట్ ప్రాంగణంలో దాదాపు రూ.6లక్షల విలువైన డబ్బు, విలువైన కాగితాలు గల బ్యాగ్‌ను మర్చిపోయి వెళ్లిపోయాడు. ఆ బ్యాగ్‌ను గుర్తించిన సాజిద్ ఆలం.. తన పైఅధికారుల సహాయంతో దాన్ని భద్రపరిచాడు. అంతేకాకుండా బ్యాగ్ కోసం తిరిగొచ్చిన సదరు చైనా యువకుడికి దాన్ని అందించాడు. ఈ క్రమంలో.. విషయాన్ని వివరిస్తూ సాజిద్ ఆలం పైఅధికారులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. సాజిద్ ఆలంపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. 


Updated Date - 2021-04-12T17:50:00+05:30 IST