విద్యార్థులకు సన్మానం
ABN , First Publish Date - 2022-07-01T06:14:05+05:30 IST
విద్యార్థులకు సన్మానం
ఆమనగల్లు/నందిగామ/మాడ్గుల, జూన్ 30: ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండాకు చెందిన కిషన్ నాయక్ కూతురు నేనావత్ ప్రియాంక ఇంటర్మీడియట్ ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 466/470 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా గురువారం మేడిగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రియాంకకు సర్పంచ్ అంబర్సింగ్ ఆధ్వర్యంలో సత్కరించారు. అదేవిధంగా నందిగామ మండలంలోని వెంకమ్మగూడకు చెందిన గుండాల కుమార్, స్వాతిల కూతురు మనోజ్ఞ ఇంటర్ ఫస్టియర్లో 437మార్కులు సాధించగా ఎంపీపీ ప్రియాంక సన్మానించారు. సర్పంచ్ రజనిత వీరేందర్, ఉపసర్పంచ్ మధు, వేణు, సాములయ్య అభినందించారు.