హోరాహోరీగా ఫుట్బాల్ టోర్నమెంట్
ABN , First Publish Date - 2022-05-29T05:50:09+05:30 IST
వి.ప్రవీణ్కుమార్, టి.సంజీవయ్యల ట్రోఫీ సౌత్ ఇండియా ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా శనివారం జరిగిన క్వాటర్ ఫైనల్ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి.
- సెమీస్కు చేరిన గద్వాల జట్టు
గద్వాల అర్బన్, మే 28: వి.ప్రవీణ్కుమార్, టి.సంజీవయ్యల ట్రోఫీ సౌత్ ఇండియా ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా శనివారం జరిగిన క్వాటర్ ఫైనల్ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. ఉదయం లీగ్ దశలో బెంగుళూరు, తమిళనాడు జట్ట మధ్య జరిగిన పోటీలో తమిళనాడు జట్టు రెండు గోల్స్ సాధించింది. అనంతరం మరో లీగ్మ్యాచ్లో గద్వాల, కడియం జట్ల మధ్య జరిగిన పోటీలో ఇరుజట్లు నిర్ణీత సమయంలో గోల్స్ సాధించకపోడంతో డ్రాగా ముగి సింది. మధ్యాహ్నం జరిగిన మొదటి క్వాటర్ ఫైనల్ మ్యాచ్లో ఫలక్నామా, హైదరాబాద్ గ్లోబుల్ జట్ల మ ధ్య జరిగిన మ్యాచ్లో చివరి నిమిషంలో గ్లోబుల్ జట్టు ఒక గోల్ సాధించి సెమీస్కు చేరింది. అనంతరం జరి గిన రెండవ క్వాటర్ ఫైనల్లో బిబిన్, తమిళనాడు జట్ల మధ్య జరిగిన పోటీలో బిబిన్(హైదరాబాద్) జట్టు తమిళనాడుపై మూడు గోల్స్ సాధించి సెమీస్కు చేరు కుంది. మూడవ క్వాటర్ ఫైనల్లో నాందేడ్, కడి యం(రాజమండ్రి) జట్ల మధ్య జరిగిన పోటీలో కడి యం జట్టు సెమీస్కు చేరింది. చివరి క్వాటర్ ఫైనల్ గద్వాల, గుంటూరు మధ్య జరిగిన మ్యాచ్లో గుంటూ రు ఒక గోల్ సాధించగా, గద్వాల జట్టు నాలుగు గోల్స్ చేసి సెమీస్కు చేరుకుంది. ఆదివారం ఉదయం మొద టి సెమీ ఫైనల్ హైదరాబాద్ గ్లోబుల్, బిబిన్ ఎఫ్సీ, రెండవ సెమీఫైనల్ గద్వాల, కడియం(రాజమండ్రి) జట్ల మధ్య పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.