వైరల్ వీడియో: రెండు రైళ్ల మధ్య ఇరుక్కుపోయిన గుర్రం.. బెదరకుండా తన ప్రాణాలను ఎలా కాపాడుకున్నదంటే..

ABN , First Publish Date - 2022-01-25T10:23:27+05:30 IST

సోషల్ మీడియో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో రెండు ఎదురెదురుగా వస్తున్న రైళ్ల మధ్య ఒక తెల్లటి గుర్రం ఇరుక్కుపోయింది. ఒళ్లు గగ్గురుపొడిచే ఆ వీడియోలో ఆ గుర్రం తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో ధైర్యం చేసింది...

వైరల్ వీడియో: రెండు రైళ్ల మధ్య ఇరుక్కుపోయిన గుర్రం.. బెదరకుండా తన ప్రాణాలను ఎలా కాపాడుకున్నదంటే..

సోషల్ మీడియో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో రెండు ఎదురెదురుగా వస్తున్న రైళ్ల మధ్య ఒక తెల్లటి గుర్రం ఇరుక్కుపోయింది. ఒళ్లు గగ్గురుపొడిచే ఆ వీడియోలో ఆ గుర్రం తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో ధైర్యం చేసింది. ఈ ఘటన ఈజిప్టు దేశంలో జరిగింది. అక్కడ రెండు రైలు పట్టాల మధ్య గుర్రం మేతమేస్తున్న సమయంలో రెండు రైళ్లు వేర్వేరు పట్టాలపై ఎదురెదురుగా వచ్చాయి. 


దీంతో ఆ అశ్వం రైలు శబ్దాలకు బెదిరిపోయి రైళ్ల శబ్దాలకు బెదిరిపోయిన ఆ గుర్రం రెండు రైళ్ల మధ్య పరుగెత్తడం మొదలుపెట్టింది. అది చూసిన రైలు ప్రయాణికులు టెన్షన్‌తో లేచి అరుపులు, కేకలు వేశారు. ఆ గుర్రానికి ఏం జరగకూడదని కొందరు భగవంతుడిని వేడుకుంటున్నారు. చివరికి ఆ గుర్రం ఏంతో వేగంతో పరిగెడుతూ అటు ఇటు పోకుండా నేరుగా ముందుకు దూసుకుపోయింది. చూస్తూ.. చూస్తూ..  ఆ గుర్రం రెండు రైళ్ల మధ్య నుంచి తప్పించుకుంది. ఈ దృశ్యమంతా ఒక ప్రయాణికుడు తన కెమెరాలో వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజెన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.


ఒక వ్యక్తి ఈ వీడియో షేర్ చేస్తూ.. ఆ గుర్రం మనుషులకు ఒక జీవిత సత్యాన్ని నేర్పిందని చెప్పాడు. రెండు రైళ్లు లాంటి కష్టాల మధ్య మనిషి చిక్కుకుపోయినప్పుడు.. ధైర్యంతో, ఏకాగ్రతతో ముందుకు సాగాలని అప్పుడే కష్టాల నుంచి బయటపడుతామని కామెంట్ పెట్టాడు.



Updated Date - 2022-01-25T10:23:27+05:30 IST