వసతి గృహాలు మూత
ABN , First Publish Date - 2021-04-21T06:41:01+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాలను మంగళవారం నుంచి మూసివేశారు.
ఒంగోలు నగరం, ఏప్రిల్ 20: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాలను మంగళవారం నుంచి మూసివేశారు. అయితే పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రం అక్కడే ఉండే అవకాశం కల్పించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో 9వతరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులను క్షేమంగా వారి ఇళ్లకు చేర్చాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ ఆయా వసతిగృహాల వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశారు.