35 ఏళ్ల మహిళ.. 22 ఏళ్ల కుర్రాడు.. గదికి బయటినుంచి తాళం.. లాడ్జి సిబ్బంది కిటికీలోంచి చూస్తే..

ABN , First Publish Date - 2021-07-26T21:16:33+05:30 IST

ఒక 22 ఏళ్ల యువకుడు 35 ఏళ్ల మహిళను తీసుకొని హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక రూమ్ తీసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి చాలాసేపు గదిలోనే ఉన్నారు.

35 ఏళ్ల మహిళ.. 22 ఏళ్ల కుర్రాడు.. గదికి బయటినుంచి తాళం.. లాడ్జి సిబ్బంది కిటికీలోంచి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఒక 22 ఏళ్ల యువకుడు 35 ఏళ్ల మహిళను తీసుకొని హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక రూమ్ తీసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి చాలాసేపు గదిలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆ యువకుడు బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ ఆ యువకుడు తిరిగిరాలేదు. దీంతో హోటల్ కుర్రాడు గదిని చెక్ చేయడానికి వెళ్లాడు. అక్కడ చూస్తే గది బయట తాళం వేసి ఉంది. దీంతో అనుమానం వచ్చిన అతను కిటికీలో నుంచి లోపలకు తొంగి చూశాడు. అంతే అతని నవనాడులూ స్తంభించిపోయాయి. వెంటనే హోటల్ మేనేజరుకు పోన్ చేసి.. హోటల్ గదిలో మహిళ మృతదేహం ఉన్నట్లు చెప్పాడు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న మేనేజర్.. పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్ ప్రాంతంలోని కుమార్ హోటల్‌లో జరిగింది. రూమ్ నెంబర్ 117లో ఈ ఘాతుకం జరిగింది.


ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌తో వచ్చిన ఏఎస్పీ దర్యాప్తు ప్రారంభించారు. సదరు మహిళతోపాటు వచ్చిన యువకుడి పేరిటే గది బుక్ చేసినట్లు గుర్తించారు. బరేలీకి చెందిన వికాస్‌గా రిజిస్టర్‌లో అతని పేరు ఉంది. అతనే ఆ మహిళను తీసుకొని వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. సదరు మహిళను బలాత్కరించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

Updated Date - 2021-07-26T21:16:33+05:30 IST