హోటల్ ముందు కూర్చున్న బిచ్చగాళ్లపై దాష్టికం.. వారిని ఎంత దారుణంగా చంపాడంటే..

ABN , First Publish Date - 2022-06-04T19:06:04+05:30 IST

సాటి మనషులు, బిచ్చగాళ్లనే జాలి, దయ లేకుండా ఓ హోటల్ యజమాని అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు

హోటల్ ముందు కూర్చున్న బిచ్చగాళ్లపై దాష్టికం.. వారిని ఎంత దారుణంగా చంపాడంటే..

సాటి మనషులు, బిచ్చగాళ్లనే జాలి, దయ లేకుండా ఓ హోటల్ యజమాని అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. తన హోటల్ ముందు కూర్చున్నారనే కారణంతో ముగ్గురు బిచ్చగాళ్లను పొట్టనబెట్టుకున్నాడు. కర్రలతో కొట్టి, సలసలా కాగే నీళ్లు పోసి వారిని కిరాతకంగా చంపేశాడు. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో గత నెల 23న ఈ ఘోరం జరిగింది. నిందితుడు స్థానిక ఎమ్మెల్యేకు బంధువు కావడంతో పోలీసులు ఈ కేసును పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

భార్యతో గొడవ.. పిల్లలతో కలిసి నదిలోకి దూకేసిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే..



పుణెలోని సస్వాద్‌కు చెందిన నీలేశ్​ జయంత్ అనే వ్యక్తి అహల్యా దేవి మార్కెట్‌లో ఓ హోటల్‌ నడుపుతున్నాడు. అతని హోటల్ ముందు ముగ్గురు బిచ్చగాళ్లు కూర్చుని అడుక్కుంటుంటారు. హోటల్‌కు వచ్చే వారు డబ్బులిస్తే తీసుకుంటారు. తన హోటల్ ముందు కూర్చోవద్దని నీలేశ్ పలుమార్లు ఆ ముగ్గురు బిచ్చగాళ్లను హెచ్చరించారు. అయినా వారు అక్కడే కూర్చోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. గత నెల 23న ఆ ముగ్గురు బిచ్చగాళ్లపై దాడి చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వారిని కర్రలతో చితకబాదాడు. 


ఆ తర్వాత మరుగుతున్న వేడి నీటిని వారిపై పోశాడు. తీవ్ర గాయాల పాలైన బిచ్చగాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ముగ్గురు వ్యక్తులు మరణించినా స్థానిక పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయలేదు. నిందితుడు స్థానిక ఎమ్మెల్యేకు బంధువు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-06-04T19:06:04+05:30 IST