Kurnoolలో గౌరు చరితారెడ్డి దంపతుల హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-21T14:57:25+05:30 IST

జిల్లాలో పాన్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి దంపతులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

Kurnoolలో గౌరు చరితారెడ్డి దంపతుల హౌస్ అరెస్ట్

కర్నూలు: జిల్లాలో పాన్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి(Gouru charita reddy) దంపతులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పాన్యం మండలం పిన్నాపురంలో ఆందోళన కార్యక్రమానికి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. పిన్నాపురంను ఓర్వకల్లులో విలీనం, గ్రీన్ కో కంపెనీ ఏర్పాటు చేసిన జలాశయం కరకట్ట పనుల బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు దెబ్బతింటున్నాయని ఎమ్మెల్యే నిర్వహించిన గ్రామ సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామ సమస్యలపై పిన్నాపురంలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి దంపతులు ఈరోజు భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-07-21T14:57:25+05:30 IST