TDP Leaders: విజయవాడలో పలువురు టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-07-26T15:22:01+05:30 IST
విజయవాడలో దళిత గర్జన నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
అమరావతి: విజయవాడలో దళిత గర్జన నేపథ్యంలో పలువురు టీడీపీ నేతల (TDP Leaders)ను పోలీసులు హౌస్ అరెస్ట్ (House arrest) చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni uma)తో సహా పలువురు తెలుగుదేశం నేతలను గృహనిర్బంధం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ధర్నా చౌక్ వచ్చే పలు రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని, దళితులపై దాడులు నిత్వకృత్యమయ్యాయని మండిపడ్డారు. మూడేళ్ళ పాలనలో జగన్ (Jagan) ఎస్సీలకు మొండి చేయి చూపించారన్నారు. దళితుల కోసం కేటాయించిన వేలకోట్ల సబ్ప్లాన్ నిధులను వైసీపీ (YCP) పాలకులు దారిమళ్లించారని ఆరోపించారు. తిరిగి ఆ నిధులన్నింటినీ రాబట్టి దళితుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీల కోసం గతంలో అమలు చేసిన భూమి కొనుగోలు పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అంబేద్కర్ విద్యా స్కీంలను జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసిందన్నారు. దళితులంతా చైతన్యవంతులై జగన్ సర్కార్పై సమరశంఖం పూరించాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు.