ఇళ్ల నిర్మాణాల వద్ద మౌలిక సదుపాయాల కల్పన
ABN , First Publish Date - 2022-05-20T05:41:43+05:30 IST
లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు చేపడతామని హౌసింగ్ సీఈ జీవీ.ప్రసాద్ తెలిపారు.
ఆకివీడు రూరల్ మే 19: లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు చేపడతామని హౌసింగ్ సీఈ జీవీ.ప్రసాద్ తెలిపారు. కుప్పనపూడిలోని తాళ్ళకోడు ఇళ్ల స్థలాల్లో గృహ నిర్మాణాలను గురువారం ఆయన పరిశీలించారు. నిర్మాణాలు వేగవంతం చేసేందుకు లబ్ధిదారులను చైతన్యపరచాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సూచిం చారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు లేవని లబ్ధిదారులు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. సమస్యలు పరిష్కారానికి అన్ని చర్యలు చేపడతామని ఆయన వారికి తెలిపారు. ఇదిలా ఉండగా భీమవరం ఆర్డివో దాసిరాజు తాళ్ళకోడు లేఅవుట్ ను పరిశీలించి, గృహనిర్మాణాలు వేగవంతం చెయ్యాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పీడీ ఏవీ.రామరాజు, ఈఈ బీవీ.రమణ, డీఈ శివరామరాజు, తహసీల్దారు గురు మూర్తి రెడ్డి, ఎంపీడీవో శ్రీకర్, ఏఈ భాస్కరరాజు, సిబ్బంది పాల్గొన్నారు.