అగ్నిప్రమాదంలో ఐదు పూరిళ్లు దగ్ధం

ABN , First Publish Date - 2021-06-20T03:32:33+05:30 IST

నగర పంచాయతీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరుపేట ప్రాంతంలోని అల్లిమడుగు కాలనీలో కట్టకింద ఉండే గిరిజనుల

అగ్నిప్రమాదంలో ఐదు పూరిళ్లు దగ్ధం
దగ్ధమవుతున్న పూరిళ్లు

అల్లూరు, జూన్‌ 19 : నగర పంచాయతీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరుపేట ప్రాంతంలోని అల్లిమడుగు కాలనీలో కట్టకింద ఉండే గిరిజనుల పూరిళ్లు  అగ్నికి ఆహుతయ్యాయి. నెల్లూరు వెంకటరమణయ్య, గందళ్ళ చెంచయ్య, ఆడిపూడి సుభాషిణి, మానికల నరసింహ, తుపాకుల వెంకయ్యలకు చెందిన పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఓ పూరింటిలో ఫ్యాన్‌ వద్ద విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని వారు బయటికి వచ్చి కేకలు పెట్టే సమయానికి మంటలు దావానంలా వ్యాపించడం, దీనికితోడు గాలి ఉండడంతో పక్కనే మరో నాలుగు పూరిళ్లకు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతో బాధితులు మిగిలారు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి బాధితులను పరామర్శించారు. తహసీల్దారు శ్రీరామకృష్ణ, నగరపాలక పంచాయతీ అధికారులు వివరాలు సేకరించారు. 

Updated Date - 2021-06-20T03:32:33+05:30 IST