నెలల తరబడి వేతనాలివ్వకుంటే ఎలా?
ABN , First Publish Date - 2022-08-10T04:55:59+05:30 IST
ఎనిమిది నెలలుగా వేతనాలు అందలేదంటూ కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛభారత్ కార్మికులు చేస్తున్న ధర్నా మంగళవారం రెండవ రోజుకు చేరుకుంది.
ప్రొద్దుటూరు రూరల్, ఆగస్టు 9: ఎనిమిది నెలలుగా వేతనాలు అందలేదంటూ కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛభారత్ కార్మికులు చేస్తున్న ధర్నా మంగళవారం రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మిక నాయకురాలు సుధ మాట్లాడుతూ ఎనిమిది నెలల నుంచి వేతనాలు ఇవ్వకుంటే తమ కుటుంబాలు ఏవిధంగా జీవించాలని ప్రశ్నించారు. కార్మికులకు ఇచ్చే రూ.6 వేలు అరకొర జీతం కూడా నెలల తరబడి ఇవ్వకపోవడం దారుణమన్నారు. సుప్రీం కోర్టు ఆర్డరును సైతం వైసీపీ ప్రభుత్వం లెక్కచేయడం లేదన్నారు. ఈ ప్రభుత్వం స్వచ్చభారత్ కార్మికులతో వెట్ట్టిచాకిరి చేయిస్తోందన్నారు.