మాకు చెప్పకుండా ఎలా ఏకగ్రీవం చేసుకుంటారు?

ABN , First Publish Date - 2021-03-07T05:35:48+05:30 IST

తమకు చెప్పకుండా, తమ అభిప్రాయాలు కనుక్కోకుండా వార్డులను ఎలా ఏకగ్రీవం చేసుకుంటారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం జమ్మలమడుగు వైసీపీ కార్యాలయాన్ని 18వ వార్డుకు చెందిన మహిళలు ముట్టడించారు.

మాకు చెప్పకుండా ఎలా ఏకగ్రీవం చేసుకుంటారు?
జమ్మలమడుగు వైసీపీ కార్యాలయానికి వచ్చిన మహిళలు

వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు

జమ్మలమడుగు రూరల్‌, మార్చి 6: తమకు చెప్పకుండా, తమ అభిప్రాయాలు కనుక్కోకుండా వార్డులను ఎలా ఏకగ్రీవం చేసుకుంటారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం జమ్మలమడుగు వైసీపీ కార్యాలయాన్ని 18వ వార్డుకు చెందిన మహిళలు ముట్టడించారు. జమ్మలమడుగు నగర పంచాయతీకి ఈనెల 10వ తేదీ పోలింగ్‌ జరుగనుంది. నగర పంచాయతీలోని 18, 19 వార్డులకు సంబంధించి ఇతరులను వైసీపీ బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారని, ఎవరికీ చెప్పకుండా ఏకగ్రీవాలు చేసుకోవడం దారుణమని వాపోయారు. ఆఫీసు వద్దకు తాము వస్తే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వాహనం ఎక్కి వెళ్లిపోయారని వాపోయారు. రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ఏకగ్రీవం పేరుతో కాలరాస్తారా అంటూ నిలదీశారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-07T05:35:48+05:30 IST