ఇప్పుడు మీ స్కూల్ ఎలా ఉంది..?
ABN , First Publish Date - 2021-06-23T06:20:43+05:30 IST
‘కొత్త బెంచీలు ఎలా ఉన్నాయి... బోర్డు బాగుందా.. మీ స్కూల్ ఇప్పుడు ఎలా ఉంది..?’ అంటూ జేసీ సిరి.. విద్యార్థులను అడిగారు.
విద్యార్థులను అడిగి తెలుసుకున్న జేసీ
అనంతపురం విద్య, జూన్ 22: ‘కొత్త బెంచీలు ఎలా ఉన్నాయి... బోర్డు బాగుందా.. మీ స్కూల్ ఇప్పుడు ఎలా ఉంది..?’ అంటూ జేసీ సిరి.. విద్యార్థులను అడిగారు. మంగళవారం కంబదూరు మండలంలోని వైసీపల్లెలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పూర్తయిన నాడు-నేడు పనులను జాయింట్ కలెక్టర్ సిరి, సమగ్రశిక్ష ఏపీసీ తిలక్ విద్యాసాగర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్కూల్ వద్ద 2వ తరగతి విద్యార్థులు కనిపించడంతో జేసీ వారితో ముచ్చటించారు. నాడు-నేడు పనులు పూర్తయిన తర్వాత కొత్త స్కూల్ ఎలా ఉందంటూ అడిగారు. అన్నీ బాగున్నాయంటూ పిల్లలు తలలూపారు. తర్వాత జేసీ, ఏపీసీ స్కూళ్లలో పనులకు సంబంధించి చిన్న చిన్న మార్పులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ చంద్రశేఖర్, స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.