ఉప్పల్ మ్యాచ్.. మెట్రో రైళ్లు రేపు రాత్రి ఎన్ని గంటల వరకంటే..
ABN , First Publish Date - 2022-09-24T19:49:21+05:30 IST
ఉప్పల్ (Uppal)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium)లో రేపు
Hyderabad : ఉప్పల్ (Uppal)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium)లో రేపు (సెప్టెంబర్ 25)న జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ (T20 Cricket Match)ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో అధికారులు (Hyderabad Metro Officials) కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టేడియం మెట్రో స్టేషన్ (Stadium Metro Station) నుంచి రేపు రాత్రి 11 గంటల నుంచి ప్రత్యేక రైళ్ల (Special Trains)ను ఏర్పాటు చేశారు. ఇక చివరి రైలు సెప్టెంబర్ 26 తెల్లవారుజామున ఒంటి గంటకు బయలు దేరనుంది.
అమీర్పేట్ - జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ (Ameerpet - JBS parade grounds) నుంచి కనెక్టింగ్ రైళ్లు ఉంటాయి. ప్రత్యేక రైళ్ల సేవ సమయంలో ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ (NGRI) మెట్రో స్టేషన్లలో మాత్రమే ప్రవేశాలు అనుమతించబడతాయి. అన్ని ఇతర స్టేషన్లు నిష్క్రమణల కోసం మాత్రమే తెరవబడతాయి. మ్యాచ్కి వెళ్లే ముందు స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి నిష్క్రమించేటప్పుడు ముందుగానే రిటర్న్ టిక్కెట్ (Return Tickets)లను కొనుగోలు చేయమని కస్టమర్లకు మెట్రో అధికారులు (Metro Officials) సూచిస్తున్నారు.
ప్రయాణ సౌలభ్యం కోసం.. అలాగే క్యూలో నిలబడకుండా ఉండటానికి స్మార్ట్ కార్డ్ల (Smart Cards)ను ఉపయోగించాలని సూచించారు. సాధారణ సమయం అంటే రాత్రి 10:15 గంటల తర్వాత డిజిటల్ టిక్కెట్లు (Digital Tickets) విక్రయించడం జరగదు. 10:15 గంటలలోపు కొనుగోలు చేసిన ప్రస్తుత టిక్కెట్లు ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ నుంచి మాత్రమే పని చేస్తాయి. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచడానికి హైదరాబాద్ మెట్రో రైలు భద్రతా సిబ్బంది (Hyderabad Metro Rail Security Staff)కి సహకరించాలని అధికారులు కోరారు.