ఇంత నిర్లక్ష్యమైతే ఎలా...?

ABN , First Publish Date - 2021-05-09T07:39:43+05:30 IST

కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని నగరపాలక సంస్థ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, తహసీల్దార్‌ పుల్లారావు హోటళ్లు, లాడ్జిల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంత నిర్లక్ష్యమైతే ఎలా...?
హోటళ్లలో తనిఖీలు చేస్తున్న కమిషనర్‌, తహసీల్దార్‌

హోటళ్లు, లాడ్జి నిర్వాహకులపై అధికారుల ఆగ్రహం

కనిగిరి, మే 8 : కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని నగరపాలక సంస్థ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, తహసీల్దార్‌ పుల్లారావు హోటళ్లు, లాడ్జిల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వారు హోటళ్లు, లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైఎస్సార్‌ రోడ్డులోని ఓ లాడ్జిలో రోజు వారీ కార్యకలాపాలు నిర్వహిస్తూ అతిథులకు ఆశ్రయం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరాయి ప్రాంతాల వారికి ఆశ్రయం ఇచ్చిన యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కందుకూరు రోడ్డు, ఎమ్మెస్సార్‌ రోడ్డు, పామూరు రోడ్డులలో హోటళ్లు నిర్వహిస్తున్న విషయాన్ని తనిఖీలో గుర్తించారు. యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహన రాకపోకలను పర్యవేక్షించారు. వారివెంట టీపీఎస్‌ శాంతి, వీఆర్వోలు ఉన్నారు. 


Updated Date - 2021-05-09T07:39:43+05:30 IST