బీజేపీ ఎలా బయటపడుతుందో: విజయసాయి
ABN , First Publish Date - 2020-07-07T00:18:16+05:30 IST
టీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నకనకలాడుతున్న టీడీపీ మిడతల దండు
అమరావతి: టీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నకనకలాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోందని అన్నారు. ఇప్పటికే కొన్ని మిడతలు ఆపార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న... విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయని దుయ్యబట్టారు. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలన్నారు. స్వార్థం కోసం జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారని, ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదని హెచ్చరించారు. పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న సీఎం జగన్ని ఈ శక్తులేవీ అడ్డుకోలేవన్నారు. మీడియా ఎంటర్ టెయినర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదని విజయసాయిరెడ్డి ఎద్దేవాచేశారు.