కోన ఆలయానికి భారీ రాబడి
ABN , First Publish Date - 2021-07-27T03:30:25+05:30 IST
పెంచలకోన క్షేత్రంలో 8 నెలలపాటు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు సోమవారం నిర్వహించిన బహిరంగ, సీల్డు టెండరు వేలం ద్వారా ఆలయానికి భారీ రాబడి వచ్చినట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు.
రాపూరు, జూలై 26:పెంచలకోన క్షేత్రంలో 8 నెలలపాటు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు సోమవారం నిర్వహించిన బహిరంగ, సీల్డు టెండరు వేలం ద్వారా ఆలయానికి భారీ రాబడి వచ్చినట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. టెంకాయలు, పూజాద్రవ్యములకు రూ.27,50,000, టోల్గేటు రుసుము వసూలు ద్వారా రూ.1,20,000, భక్తులు సమర్పించిన వస్త్రాలు సేకరించుకునేందుకు రూ.4,65,000, పూల విక్రయాలకు రూ.2,45,000, చెప్పులు భద్రపరచుటకు రూ.1,85,000 వచ్చిందన్నారు. కోర్టు పరిఽధిలో ఉన్నందున తలనీలాల వేలం వాయిదా వేశామన్నారు.