తుంగభద్రకు భారీ ఇన్ఫ్లో
ABN , First Publish Date - 2021-07-25T06:22:44+05:30 IST
ఎగువన మలేనాడు, శివమొగ్గ, ఆగుంబే, హరిహరలో భారీ వర్షాలకు తుంగభద్రకు వరద నీరు భారీగా వస్తోంది.
- నదితీర ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
- నేడు గేట్లు ఎత్తి.. నదిలోకి వరద
హాలహర్వి, జూలై 24: ఎగువన మలేనాడు, శివమొగ్గ, ఆగుంబే, హరిహరలో భారీ వర్షాలకు తుంగభద్రకు వరద నీరు భారీగా వస్తోంది. 2 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతుందని అంచనా వేసిన బోర్డు అధికారులు ఆదివారం గేట్లు ఎత్తి నదికి నీరు వదిలేందుకు సిద్ధమయ్యారు. దీంతో నదితీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బళ్లారి, కర్నూలు జిల్లా యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేశారు. పదేళ్లలో జూలై నెలా ఖరుకు పూర్తి స్థాయిలో తుంగభద్ర జలాశయం నిండిపోవడం ఇదే ప్రథమ మని బోర్డు అధికారులు తెలిపారు. ఉదయం 71 టీఎంసీలున్న జలాశయం సాయంత్రానికి 75 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం 1,22,891 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉండగా ప్రస్తుతం 1625.67 అడుగుల నీరు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలకు గాను 77.056 టీఎంసీల నీరు ఉంది.