TS News: వికారాబాద్లో భారీ శబ్ధం... కంపించిన భూమి
ABN , First Publish Date - 2022-09-30T15:18:38+05:30 IST
జిల్లాలోని పరిగి మండలం రంగాపూర్, రంగాపూర్ తాండాల్లో భారీ శబ్ధం వినిపించింది.
వికారాబాద్: జిల్లాలోని పరిగి మండలం రంగాపూర్, రంగాపూర్ తాండాల్లో భారీ శబ్ధం వినిపించింది. భారీ శబ్దానికి భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ళ నుండి బయటకు వచ్చారు. ఏం జరిగిందనే అయోమయంలో గ్రామస్థులు ఉన్నారు. తుపాకీ పేల్చినట్టు శబ్దం వచ్చి భూమి కుదేసినట్టి అనిపించిందని జనాలు చెబుతున్నారు. విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని భూకంపమా... మరేమిటని ఆరా తీసే పనిలో పడ్డారు.