హెచ్చార్సీకి వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తుంది: జస్టిస్ సీతారామమూర్తి

ABN , First Publish Date - 2022-06-30T03:37:25+05:30 IST

మానవ హక్కుల కమిషన్ (Human Rights Commission)‎కు వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తున్నామని...

హెచ్చార్సీకి వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తుంది: జస్టిస్ సీతారామమూర్తి

రాజమండ్రి(Rajahmundry): మానవ హక్కుల కమిషన్ (Human Rights Commission)‎కు వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తున్నామని మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి (Justice Seetharama Murthy)అన్నారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో మానవ హక్కులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కాకినాడ(Kakinada)లో నిర్వహించిన విచారణ‎లో 20 కేసులు పూర్తి స్థాయిలో పరిష్కరించామన్నారు. పోలీస్, రెవెన్యూశాఖలపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.  బాధితుల వద్దకే వెళ్ళి విచారణ చేపట్టే విధంగా వివిధ ప్రాంతాల్లో క్యాంప్ సిట్టింగ్‎లు నిర్వహిస్తున్నామని జస్టిస్ సీతారామమూర్తి తెలిపారు.

Updated Date - 2022-06-30T03:37:25+05:30 IST